Friday 18 April 2014

విష వలయంలో రైతాంగం


అధిక దిగుబడులను రాబట్టాలనే ఆశతో పంటలపై రకరకాలా విషమైన క్రిమికీటకాదులను చంపే ఎరువులను, పురుగు మందులను ఉపయోగించి లాభాలను పొందాలనుకొనే రైతులు "నక్కను చూసి పులి వాత పెట్టుకొన్నట్లు" పక్కన రైతు పత్తి పంట వేసాడు అని మనం కూడా పత్తి పంట వేద్దాం అనే చందాన కాకుండా విభిన్నంగా ఎరువులకు దూరంగా ఉండే వేరే పంటలు ( పెసరు, మొక్కజొన్న, మిర్చి, వేరుశనగ...మొ|| వి. ) రకరకాలుగా ప్రతి సంవత్చరం మారుస్తూ వేయడం వల్లా భూసారాన్ని, పంటలనూ కలుషితం కాకుండా కాపాడగలుగుతాడు.

పర్యావరణాన్ని కాపాడడమే లక్ష్యంగా భూమిని, ప్రాణకోటిని సర్వనాశనం చేసే పురుగు మందులను, ఎరువులను విస్మరించి సేంద్రియ వ్యవసాయానికై తక్కువ ఖర్చుతో లభించే కుళ్ళిపోయిన కొబ్బరిపీచు, గోపేడ లాంటి సహజ ఎరువులను ఉపయోగించడం వల్ల భూసారంను ( భూమిలోపలి పొరలలో నీటి సాంద్రత తగ్గకుండేందుకై ) పెంచే ఆధునిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులను రాబట్టి ఆర్థికంగా ఎదుగడమే కాక సకల ప్రాణ కోటిని విషవలయం నుండి తప్పించి "ప్రాణం పోసే రైతే దెశానికి వెన్నెముక" అవుతాడు అనుటలో సందేహం లేదు.

No comments:

Post a Comment